సురవాలీలో బస్సు, లారీ ఢీ: 10 మంది విద్యార్థులు మృతి

జైపూర్‌: హనుమాన్‌ఘుర్‌ జిల్లా సురవాలీలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 20 మంది విద్యార్థులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరస్వతి స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఈ ఉదయం స్కూల్‌ బస్సులో వస్తుండగా జాతీయ రహదారిపై హనుమాన్‌ఘుర్‌ జిల్లా సురవాలి బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూల్‌ విద్యార్థులు 8మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమారు 20 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు.