11నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు

గుంటూరు,మార్చి8(జనం సాక్షి): జిల్లాలో ఈనెల 11 నుంచి జరగనున్న ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంటర్‌ బోర్డు ఆర్జేడీ వీవీ సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రయోగ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 97 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈనెల 9న ఇంటర్‌ విద్యార్థులకు నైతిక, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఆర్‌ఐవో బి.ఉమాదేవి తెలిపారు.