12 గంటలకు వాయిదా పడిన లోక్సభ
న్యూఢిల్లీ: లోక్సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర తెదేపా, కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సీమాంధ్ర ఎంపీలు అడ్డుకోవడంతో స్పీకర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.