12 గంటల వరకు వాయిదా పడిన రాజ్యసభ
న్యూఢిల్లీ: రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన కొనసాగించారు. జమ్మూకాశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభను ఛైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.