మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన రాజ్యసభ

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ ప్రారంభభమైన పది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సమైక్యాంధ్ర నినాదాలతో సమావేశం మొదలవుతూనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ నేతల తీరును భాజపా సభ్యులు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ సభ్యుల వ్యవహారధోరణికి నిరసనగా భాజపా సభ్యులు వాకౌట్‌ చేశారు. సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని సరిదిద్దడానికి ఛైర్మన్‌ ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. దాంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.