14నమెగా లోక్‌ అదాలత్‌

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.శ్రీనివాస్‌ తెలిపారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎం.లక్ష్మణ్‌ ఆదేశాల మేరకు జాతీయ మెగాలోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ లోక్‌అదాలత్‌లో మోటార్‌ యాక్సిడెంట్‌ నష్టపరిహారం కేసులు, సివిల్‌, క్రిమినల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులతో జాతీయ మెగా లోక్‌అదాలత్‌ నిర్వహణపై విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.