14మంది కుటుంబ సభ్యులను చంపేసి, ఆత్మహత్య
మహారాష్ట్ర..థానేలో ఓ దుండగుడు మారణహోమం సృష్టించాడు. 14 మంది కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దుండగుడి దాడిలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హంతకుడు హన్సిల్ వారేకర్గా గుర్తించిన పోలీసులు…అతడు ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడని చెప్పారు.