15 లీటర్ల గుడుంబా పట్టివేత, కేసు నమోదు

టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): వాహన తనిఖీలో భాగంగా 15 లీటర్ల గుడుంబా ప్యాకెట్ల తో వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. టేకులపల్లి ఎస్ఐ రమణారెడ్డి కథనం ప్రకారం బొమ్మనపల్లి, చంద్రు తండా రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో గుగులోతు రాజా అనే వ్యక్తి గుడుంబా తయారు చేసుకుని 15 లీటర్లు గుడుంబాను ప్యాకెట్లలో నింపి ఓ సంచిలో వేసుకొని కాలినడకన వెళ్తున్న క్రమంలో అనుమానంతో సంచిని పరిశీలించగా గుడుంబా ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకొని టేకులపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.