19న ఎన్‌ఎస్‌పి కార్యాలయం ముట్టడి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : నాగార్జునసాగర్‌ జలాల విడుదల కోసం ఈ నెల 19న నిర్వహించే ఎన్‌ఎస్‌పి కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎర్ర బాబు కోరారు. నాగార్జునసాగర్‌ నీటిని విడుదల చేసి ఆయకట్టులోని పంట భూములను కాపాడాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడం వల్ల గ్రామాల్లో పరిపాలన స్తంభించిపోయిందని అన్నారు. గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడంతో ప్రజలు విషజ్వరాల బారిన పడి మంచమెక్కుతున్నారని, మరికొందరు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఎద్దేవా చేశారు.