2 గంటల వరకు వాయిదా పడిన ఉభయసభలు

ఢిల్లీ,(జనంసాక్షి):ం లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. పాక్‌ సైనికుల కాల్పులు, కాశ్మీర్‌లో అల్లర్లపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా కాశ్మీర్‌ అల్లర్లపై కేంద్ర మంత్రి చిదంబరం స్టేట్‌మెంట్‌ ఇవ్వకుండా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు.