రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మరో సభ్యుడు బోడోలాండ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.