2013లోనే లోక్సభకు ఎన్నికలు: సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభకు ఎన్నికలు 2013 లోనే వచ్చే అవకాశముందని భారతీయ జనతా పార్టీ జోస్యం చెబుతుంది. ఢిల్లీ బీజేపీ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గ్నొ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ సోమవారం కాంగ్రెస్ పార్టీపై విరుచుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లోనూ విఫలం కావడమే కాకుండా అవినీతిలోనూ ఆరితేరిందన్నారు. ధరల పెరుగుదలను హస్తం పార్టీ నేతలు అడ్డుకోలేకపోతున్నారని సుష్మా స్వరాజ్ విమర్శించారు.