కమాన్ పూర్ లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు జనంసాక్షి, మంథని : అధికార భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది సిట్టింగులకు మరోసారి అవకాశం ఇవ్వగా.. మంథని నుంచి పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ కు అవకాశం ఇచ్చారు. పుట్ట మధుకు టికెట్ రావడంతో కమాన్ పూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణ సంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
తాజావార్తలు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- బోనాల సంబరం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత
- అన్ని కోచ్లకు సీసీకెమెరాలు..
- ఇంధన స్విచ్లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్లో రెడ్అలర్ట్
- మరిన్ని వార్తలు