26 జీవోల కేసులో మంత్రులకు ఊరట

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులకు 26 జీవోల కేసులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో మంత్రులను, ఐఏఎస్‌లను నిందితులుగా చేర్చాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది హైకోర్టులో ఈ కేసు విచారణలో ఉన్నందున అభ్యంతరాలుంటే అక్కడే చెప్పాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.