మధ్యాహ్నం 3గంటలకు వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ: రెండు గంటలకు సమావేశమైన లోక్‌సభలో మరోసారి సీమాంధ్ర ప్రాంత సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సరిహద్దులో కాల్పుల ఘటనలు, పశ్చిమబెంగాల్‌ శాంతిభద్రతలు తదితర అంశాలపై సభ్యుల నినాదాలు కొనసాగాయి. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను మూడు గంటల వరకు వాయిదా వేశారు.