30కి చేరిన థానే మృతుల సంఖ్య

ముంబై, జనంసాక్షి: థానేలోని  ముంబ్రా సమీపంలో నిన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది భవనం శిథిలాల కింద కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీస్తోన్నారు. ఇప్పటి వరకు 30 మృతుదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి.