రెండు రోజుల్లో 3.75 కోట్లు ఆర్జించిన షోలే త్రీడీ

ముంబయి: బాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమా షోలే త్రీడీ వర్షస్‌ విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.3.75 కోట్లు వసూలు చేసిందని సినీ వాణిజ్యవర్గాలు వెల్లడించాయి. జనవరి 3న ఈ సినిమా విడుదలైంది. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, హేమామాలిని నటించిన ఈ సినిమా త్రీడీ వర్షస్‌, రెస్టోరేషన్‌, కన్వర్షస్‌లకు కలిపి రూ. 20 కోట్లు ఖర్చుయినట్లు ప్రొడ్యూసర్లు తెలిపారు. షోలే ఒరిజినల్‌ సినిమా నిర్మాణానికి రూ. 4 కోట్లే ఖర్చయింది.