5న నష్టపరిహరం పంపిణీ
కడప, ఆగస్టు 3 : ఎపిఎండిసి డేంజరు జోన్ నిర్వాసితులకు ఈ నెల 5వ తేదీన నష్టపరిహారాన్ని పంపిణీ చేయనున్నట్టు మాజీ ఎంపి రామయ్య చెప్పారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఈ పరిహారాన్ని అందిస్తారని చెప్పారు. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డేంజరు జోన్ నిర్వాసితుల పరిహారం పంపిణీ అంశం త్వరితగతిన పూర్తయ్యేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య కృషి చేశారని అన్నారు.