సాయంత్రం 5 గంటలకు కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జంనసాక్షి): ఈ సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సమావేశం తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని గతంలో దిగ్విజయ్‌సింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.