55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బ్రోచర్న ను ఆవిష్కరించిన :- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల ప్రతినిధి నవంబర్ 09(జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చే జిల్లా కేంద్రం గ్రంధాలయ 55 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు బ్రోచర్లు ను స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. 55వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ గారి ఆధ్వర్యంలో 14-11-2022 నుండి 20-11-2022 వరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ…. జిల్లా గ్రంధాలయ లో గత సంవత్సరం కన్నా సంవత్సరం 55వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి.గ్రంధాలయంలో సంబంధించిన పుస్తకాలను పాఠకులకు అలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పుస్తకాలను అన్ని సౌకర్యాలను కల్పించాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రంధాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఛైర్మన్, అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ లు ప్రతాప్ గౌడ్, రాజారెడ్డి జెడ్పిటిసి లు రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు