55 వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలో శనివారము తమ డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు 55 వ రోజుకు చేరాయి. మంగళవారం వీఆర్ఏలతొ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చర్చలకు పిలిచి మళ్లీ రెండవసారి చర్చిద్దాం అని తెలిపారని అంతవరకు తాము శాంతియుతంగానే ధర్నా చేస్తామని వీఆర్ఏలు తెలిపారని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు లక్ష్మణ్,మండల అధ్యక్షుడు ఈశ్వర్, మమత, పెద్ద బీచుపల్లి, విజయుడు, నాగమణి, సవరమ్మ, ఖాజా హుస్సేన్, బడే సాబ్, పాండు వివిధ గ్రామాల వి ఆర్ ఏ లు పాల్గొన్నారు.