నటి మంజుల అంత్యక్రియలు పూర్తి

చెన్నై,(జనంసాక్షి): నటి మంజుల అంత్యక్రియలు ముగిశాయి. ఈ  మధ్యాహ్నం పోరూర్‌ శశ్మానవాటికలో మంజుల భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె చితికి భర్త విజయ్‌కుమార్‌ నిప్పంటించారు. సినిమా ప్రముఖులు, అభిమానులు అశ్రునయనాలతో ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 59 ఏళ్ల ముంజుల అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.