త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం :పీసీసీ చీఫ్‌ బొత్స

న్యూఢిల్లీ,(జనంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌సింగ్‌, ఆజాద్‌తో భేటీ ముగిసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పేందుకే సమావేశాలు జరుపుతున్నారని తెలిపారు. తెలంగాణపై తన అభిప్రాయాన్ని అడిగారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతుందన్నారు.