ఆహార భద్రతకు మద్దతు తెలిపిన బీఎస్పీ అధినేత్రి

లక్నో,(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆహార భద్రత పథకంకు బీఎస్పీ అధినేత్రి మాయవతి మద్దతు తెలిపారు. తమ పార్టీ ఆహార భద్రతకు  సంబంధించిన బిల్లుకు మద్దతునిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్‌ జారీచేయడాన్ని ఆమె తప్పుపట్టారు. కాంగ్రెస్‌ నేతలకు పేదరికం అంటే తెలియదని ఆమె విమర్శించారు. రూ. 5కు, రూ.15కు భోజనం దొరుకుతుందని వ్యాఖ్యలు చేయడం అవుతుందని ఆమె తెలిపారు.