రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే మా ధ్వేయం: ఎమ్మెల్యే టి.జి

ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ ధ్వేయమని ఎమ్మెల్యే టి.జి. వెంకటేష్‌ అన్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యంత వెనుకబడింది. రాయలసీమ ప్రాంతమేనన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాల్సి వస్తే రాయలసీమ ముందు వరుసలో ఉంటుందన్నారు. తెలంగాణతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.