మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న సినీ నటుడు గోపీచంద్‌

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రాన్ని సినీ నటుడు గోపీచంద్‌ దంపతులు ఈ ఉదయం దర్శించుకున్నారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ బి. గోపాల్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఉంటుందని తెలిపారు.