బెంగాల్‌లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ భారీ బందోబస్తు మధ్య ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐదు దశల్లో జరిగిన పోలింగ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కౌంటింగ్‌కు భారీ బందోబస్తు కల్పించారు. 329 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 1.69 లక్షల అభ్యర్థుల భవితవ్యం సాయంత్రం కల్లా తేలనుంది. వీరిలో 90 వేల మంది మహిళలు ఉన్నారు. ఐదు దశల్లో 24 మంది మృతి చెందిన విషయం విదితమే.