రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశాన్ని తేల్చే దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. ఈ సమావేశం మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు జరగనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌మాకెన్‌ తెలిపారు. సీడబ్ల్యూసీ భేటీ తర్వాత యూపీఏ సయన్వయ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో తెలంగాణ మిత్ర పక్షాల అభిప్రాయాలను అధిష్ఠానం సేకరించనుంది. విభజన తప్పదని ఇప్పటికే రాష్ట్ర నేతలకు హైకమాండ్‌ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.