పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ ముందంజ

కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ భారీ బందోబస్తు మధ్య ప్రశాతంగా కొనసాగుతుంది. అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ 17 జిల్లాల్లో ముందంజలో ఉంది. సాయంత్రం కల్లా పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడుతాయి. ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.