తెలంగాణపై నిర్ణయం ఒకటే మిగిలింది: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై విస్తృత సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌  సింగ్‌ వెల్లడించారు. తెలంగాణ అంశంపై నిర్ణయం ఒకటే మిగిలిందని చెప్పారు. తెలంగాణపై తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని తెలిపారు. తాను యూపీఏ సమన్వయ కమిటీ సభ్యుడిని కానని, సీడబ్య్లూసీ సమావేశం అజెండా ఏమిటో తనకు తెలియదని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలకు, తెలంగాణపై వైఖరి ప్రకటనకు సంబంధం లేదని వివరించారు.