ఆహార భద్రత ఆర్డినెన్స్‌పై వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఆహారభద్రత ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. న్యాయమూర్తులు టీఎస్‌ ఠాకూర్‌, విక్రమాజిత్‌ సేన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనరును హైకోర్టుకు వెళ్లవలసిందిగా సూచించింది.