రూ. వంద కోట్లు ఉంటే రాజ్యసభలో స్థానం: కాంగ్రెస్‌ ఎంపీ బీరేందర్‌సింగ్‌

ఢిల్లీ: ఎగువ సభలో స్థానం పొందే విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి మరో కాంగ్రెస్‌ ఎంపీ రాజధానిలో దుమారం లేపారు. హర్యానాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ బీరేందర్‌సింగ్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘వందకోట్లు ఉంటే రాజ్యసభలో స్థానం పొందవచ్చని’ తనతో  ఒకసారి ఎవరో చెప్పారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యతో ప్రతిపక్షం మండిపడింది. అత్యున్నత చట్ట సభ స్థానాన్ని ఈ స్థాయికి దిగజార్చిన ఘనత కాంగ్రెస్‌దేనని విమర్శించింది.