వీహెచ్‌తో తెలంగాణ నేతల సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావుతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సీమాంధ్ర నేతల లాబీయింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ నేతలు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.  చివరి నిమిషంలో అధిష్ఠానం తెలంగాణపై వెనక్కి తగ్గితే తమ దారి తాము చూసుకుంటామని తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది.