సోనియాతో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాను కలిసి రాష్ట్రాన్ని విభజించొద్దని సీమాంధ్ర నేతలు విజ్ఞప్తి చేశారు. చివరి సారిగా ముగ్గురు కేంద్ర మంత్రుల ముగ్గురు ఎంపీలు సోనియాను కలిశారు.