తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది: సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని సీమాంధ్ర నేతలు కలిశారు. ఇవాళ వారితో ఈమె సధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. వారిని సోనియా బుజ్జగించినట్లు తెలుస్తుంది. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్లలేమని ఆమె వారితో చెప్పినట్లు బోగట్టా. ఈ ఒక్కరోజుతో అంతా అయిపోయిందని అనుకోవద్దు. ఆందోళన చెందవద్దు. మీ ప్రాంతాలకు అన్యాయం జరుగకుండా చూస్తాం అని ఆమె వారికి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.