పది జిల్లాలతో కూడిన తెలంగాణ : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని, సంప్రదింపులు, చర్చల అనంతరం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకున్నామని, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఏఐసీసీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలోపు సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం నదీజలాలు పంపకం, విద్యుత్‌ పంపిణీపై ఒక కమిటీని నియమించనున్నట్లు వివరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాలపరిమితి ఉంటుందని ఆయన వెల్లడించారు.