మన్మోహన్‌, సోనియాలకు కృతజ్ఞతలు : జానారెడ్డి

న్యూఢిల్లీ : ప్రత్యేక రాష్ట్రం కోసం 1956 నుంచి అనేకమంది ఎన్నో త్యాగాలు చేశారని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేసిన సంస్థలు, నాయకులకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2000 నుంచి 2013 వరకు అనేక విజ్ఞప్తులు చేశామన్నారు. తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.