కాంగ్రెస్ నిర్ణయం ప్రజల మనోభావాలను గౌదవించడమే : అద్వానీ
న్యూఢిల్లీ : తెలంగాణపై కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలను గౌరవించడమేనని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ భాగస్వామ్య పార్టీల కారణంగా గతంలో నిర్ణయం తీసుకోలేకపోయామని ఆయన అన్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఏర్పడి ఉండాల్సిందని అన్నారు.