మన్మోహన్సింగ్ను కలవనున్న కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్సింగ్ను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు ఈ ఉదయం కలవనున్నారు. ఈ సందర్భంగా వారు రాజీనామా లేఖలను ప్రధానికి సమర్పించనున్నారు. కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి. జేడీ శీలం, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, పురందేశ్వరి తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. చిరంజీవి, పనబాక లక్ష్మి, కిశోర్ చంద్రదేవ్ రాజీనామాలకు దూరంగా ఉన్నారు.