రెండుగా విడిపోతేనే అద్భుత ప్రగతి: డి.శ్రీనివాస్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ భేటీ ముగిసింది. అమ్మ పిలుపు అందుకున్న ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లి సోనియాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై డీఎస్ ఆమెకు వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో ఉద్రిక్తతల కారణంగానే రాజీనామాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోతే రెండు రాష్ట్రాల్లోనూ అద్భుత ప్రగతి ఉంటుంది. సీమాంధ్రకు అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తామని సోనియా తనతో అన్నారని వివరించారు. ఈ నిధులతో సీమాంధ్రను సువిశాలంగా, అభివృధ్ధి పతంలో నడిపించవచ్చని అన్నారు.