తెలంగాణబిల్లుపై సంతకం చేయించాలి: ప్రకాశ్ జవదేకర్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఒక ప్రకటన చేసిన తర్వాత వెనక్కి తగ్గడం కాంగ్రెస్పార్టీకి పరిపాటిగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. తెలంగాణ బిల్లుపై వీలైతే ఈ వారం రోజుల్లోపే రాష్ట్రపతితో సంతకం చేయించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసారి వెనక్కి తగ్గకుంటేనే కాంగ్రెస్ను నమ్ముతానని ఆయన అన్నారు. వెనక్కి వెళితే తెలంగాణ ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు.