హైదరాబాద్ తెలంగాణలో అంతర్బాగం: దిగ్విజయ్సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగానలో అంతర్భాగమే అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన సీఎన్ఎన్ ఐబీఎన్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ గురించి మాట్లాడారు. హైదరాబాద్ పదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పదేళ్ల తర్వాత తెలంగాణ శాశ్వత రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చెప్పారు. సీమాంధ్రకు కొత్త రాజధానిగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.