హోంమంత్రి షిండేకు శస్త్ర చికిత్స

ముంబై,(జనంసాక్షి): కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు శస్త్ర చికిత్స జరిగింది. ఇవాళ ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించారు. చికిత్స అనంతరం షిండే కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రెండుమూడు రోజుల్లో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి