అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): నేటి నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. గత సమావేశాల్లో చాలా సమయం వృధా అయిందని గుర్తు చేశారు. ఇప్పుడు అలా జరగదు అని ఆశిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.