లోక్సభ డిప్యూటీ చీఫ్ విప్గా మధుయాష్కీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ డిప్యూటీ చీఫ్ విప్గా నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్థుతం లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను చీఫ్ విప్గా ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న సమయంలో యాష్కీకి కీలక పదవి అప్పగించడంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతుంది. కాగా, తనకు డిప్యూటీ చీఫ్ విప్ బాధ్యతలు అప్పజెప్పినందుకు సోనియాకు యాష్కీ కృతజ్ఞతలు తెలిపారు.