తెలంగాణ ఏర్పాటుపై ద్విసభ్య కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం చకచక పనులను ప్రారంభించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పర్యవేక్షించేందుకు కేంద్ర రక్షణ  మంత్రి ఏకే ఆంటోని, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌లతో కూడిన ద్విసభ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ,సీమాంధ్రకు చెందిన నేతుల ఈ కమిటీ ముందు వారివారి వాదనలు వినిపించ వచ్చని కేంద్రం తెలిపింది. ఈ రెండు కమిటీలు నీళ్లు, నియామకాలు, నిధులు గురించి పరిశీలిస్తుందని పేర్కొంది.