కాశ్మీర్‌లో జరిగిన కాల్పులపై రాజ్యసభలో డిమాండ్‌ చేస్తున్న బీజేపీ

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ వద్ద ఈ ఉదయం పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. పాక్‌ కాల్పుల ఘటనపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై రక్షణ మంత్రి ప్రకటన చేస్తారని కేంద్రం తెలిపింది.