జనాన్ల మృతికి నివాళులర్పించిన: సీఎం నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన భారత జవాన్లకు గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీ నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. అరుణ్‌జైట్లీ, మురళీ మనోహర్‌, షావానజ్‌ హుస్సేన్‌ మృతులకు నివాళులర్పించారు. ఈ ఘటనపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చ చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.