చైనా, పాక్‌ నుంచి దేశ భద్రతకు ముప్పుపొంచి ఉంది: ములాయం

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌ నుంచి దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఎస్పీ అధినేత, ఎంపీ ములాయం సింగ్‌ పేర్కొన్నారు. భారత జవాన్ల మృతిపై ఆయన లోక్‌సభలో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ వద్ద పాక్‌ సైన్యం జరిపిన కాల్పులు అయిదుగురు భారత జవాన్లు మృతి చెందడం తనకు బాధ కలిగించిందన్నారు. మృతులకు కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. చైనా, పాక్‌ నుంచి నిరంతరం చొరబాట్లు జరుగుతున్నాయని, సమిష్టిగా ఎదుర్కొవాల్సిన అవసరం ఉందన్నారు.