రేపటికి వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ ఎంపీలు సమైక్య నినాదాలతో సభను హోరెత్తించారు. దానికి తోడు భారత సైనికులపై పాక్‌ సేవలు కాల్పులు జరిపిన ఘటనపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేయడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.